నూతన సంవత్సరంలో టీఆర్ పార్టీ మొదటి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ భవన్లో భేటీ జరగనుందన్నారు.
ఈ సమావేశంలో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించనున్నారన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లకు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారన్నారు.