సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం..500 కోట్ల విరాళం ప్రకటించిన టీఆర్ఎస్ శ్రేణులు
కరోనా వైరస్పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన యుద్ధానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు 500 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు 16 మంది కూడా 80 కోట్ల నిధిని అందించారు.