తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాయస్ కోపంతో ఇమ్రాన్ ముక్కును కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తుచేస్తున్నారు.