ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు దీనికి నిదర్శనమన్నారు. 50 వేల మెజార్టీ దాటుతుందని అన్నారు సైదిరెడ్డి. ఈ విజయానికి కేసీఆర్ హవానే కారణమన్నారు. కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరని అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలం మాటలతో ప్రజలను మభ్యపెట్టారని సైదిరెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. అధికార టీఆరెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డికి 14,300 ఓట్ల మెజార్టీ వచ్చింది.