టిక్కెట్ దక్కని వారిని బుజ్జగిస్తున్న టీఆర్ఎస్

చందానగర్ డివిజన్ లో టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన స్వచ్ఛంద సంస్థ అధినేత గుడ్ల ధన లక్ష్మిని చేవెళ్ల టీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి స్వయంగా కలిశారు.

Update: 2020-11-21 16:13 GMT

టిక్కెట్ ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను చల్లార్చే పనిలో పడింది టీఆరెస్. చందానగర్ డివిజన్ లో టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన స్వచ్ఛంద సంస్థ అధినేత గుడ్ల ధన లక్ష్మిని చేవెళ్ల టీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి స్వయంగా కలిశారు.లాక్ డౌన్ సమయంలో గుడ్ల ధన లక్ష్మి ట్రస్ట్ చేసిన సేవలు మరిచిపోలేమని, ఆమె సేవలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైతం మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. టిక్కెట్ రానందున నామినేషన్ కూడా వేయలేదని ధనలక్ష్మి సేవలను ఖచ్చితంగా టీఆరెస్ పార్టీ గుర్తించి భవిష్యత్తులో మంచి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.

Tags:    

Similar News