హైదరాబాద్ - కర్నూల్ మధ్య నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

Update: 2019-10-09 14:52 GMT

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోడూర్ వద్ద రైల్వే ట్రాక్ సరిచేసే మిషన్ అదుపుతప్పి ట్రాక్ పై పడిపోయింది,. కర్నూల్- హైద్రాబాద్ మార్గంలో రైళ్ల రాతపోకలకు అంతారాయం ఏర్పడింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఆర్టీసి కార్మికుల సమ్మెతో బస్సులు నడవత ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులకు..రైల్వే అదికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడిపోయిన రైల్వే ట్రాక్ తనిఖీ మిషన్ ను తొలగించేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. 

Tags:    

Similar News