తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయింది. చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో సమావేశమైన క్రమశిక్షణా సంఘం రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. క్రమశిక్షణా సంఘం తమ నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించింది. అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనుందని కోదండరెడ్డి తెలిపారు. గతంలో కూడా పార్టీపై విమర్శలు చేసి రాజగోపాల్ రెడ్డి షోకాజ్ నోటీసులు అందుకున్నారు.