ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2019-06-27 03:32 GMT

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే వారి మృత్యువుకు దారితీసింది. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్‌లోని షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే టీఎస్‌08ఈబీ1445 నెంబర్‌ ప్లేటు గల కారు గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుతోంది. అయితే అతి వేగంగా వెళుతున్న కారు నిజామాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఓ లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలనికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. 



 



Tags:    

Similar News