Bandi Sanjay: మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ
Bandi Sanjay: కాంగ్రెస్ లో చేరేముందు పొంగులేటి ,జూపల్లి ఆలోచించుకోవాలి
Bandi Sanjay: మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ
Bandi Sanjay: తెలంగాణలో 30 రోజులపాటు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ . రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సంయుక్త రాజకీయాలు చేస్తుందన్నారు. మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ అని... ఆలాంటి పార్టీలో చేరే ముందు పొంగులేటి ,జూపల్లి ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు బండి సంజయ్ . కరీంనగర్ లో ROB నిర్మాణానికి పూర్తినిధులు తెచ్చింది బీజేపీ అన్నారు. అభివృద్ధి పై మాట్లాడానికి KTR కి సిగ్గుండాలని బండిసంజయ్ విమర్శించారు.