ఉంగరాన్ని దొంగిలించిందని పనిమనిషి ఇంట్లో పూజలు..

ఉంగరాన్ని దొంగిలించిందంటూ పనిమనిషి ఇంట్లో తాంత్రిక పూజలు చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసు కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం, పెత్తుల్ల గ్రామనికి చెందిన యశోద కుమారుడి కుటుంబం జిల్లెలగూడ లలితానగర్‌లో నివాసముంటుంది.

Update: 2019-09-24 05:04 GMT

ఉంగరాన్ని దొంగిలించిందంటూ పనిమనిషి ఇంట్లో తాంత్రిక పూజలు చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసు కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం, పెత్తుల్ల గ్రామనికి చెందిన యశోద కుమారుడి కుటుంబం జిల్లెలగూడ లలితానగర్‌లో నివాసముంటుంది. అయితే యశోద కోడలు మౌనిక చెందిన బంగారు ఉంగరం మాయమైంది. ఉంగరాన్ని పనిమనిషి నర్సమ్మ తీసిందనే అనుమానంతో వేధించసాగారు. నర్సమ్మ తనకు ఏపాపం తెలియదన్న వారు వినిపించుకోలేదు.

సోమవారం మంత్రసానిని పిలిపించి నర్సమ్మ ఇంట్లో ముగ్గులు వేసి , నిమ్మకాయలు, మిరపకాయలు, కుంకుమ తదితరాలు పెట్టి మంత్రతంత్రాలు చేయించారు. అయితే తమపై దొంగతనం నేరం మోపి వేధింపులకు గురిచేసశారని ఆరోపిస్తూ బాధితురాలు మీర్ పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులుః కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని అనుమతి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News