జీహెచ్ఎంసీలో నేరేడ్‌మెట్‌ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ

నేరేడ్‌మెట్‌ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్వస్తిక్‌ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణలోకి తీసుకోవాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Update: 2020-12-07 05:30 GMT

నేరేడ్‌మెట్‌ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్వస్తిక్‌ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణలోకి తీసుకోవాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఉత్తర్వులపై.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ బెంజ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్‌ దాఖలయ్యింది.హైకోర్టు ఆదేశాలతో నేరేడ్‌మెట్‌ ఫలితం ఆగిపోయాయి. అప్పీల్‌ పిటీషన్‌ను డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌లో తేల్చుకోవాలని చెప్పేసింది. ఇవాళ ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మరోసారి విచారణ జరపనుంది.

Tags:    

Similar News