Warangal: ఎంజీఎం హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత

Warangal: దీక్ష చేస్తోన్న శానిటేషన్ సిబ్బంది అరెస్ట్ * హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టిన తోటి కార్మికులు

Update: 2021-04-01 05:15 GMT

ఫైల్ ఇమేజ్ 

Warangal: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలు చెల్లించడం లేదంటూ దీక్షకు దిగిన శానిటేషన్ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో తోటి కార్మికులు హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ క్రమంలో కొందరు కార్మికులు హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Full View


Tags:    

Similar News