Telangana Updates: జనగామ జిల్లా బచ్చన్నపేటలో దొంగల బీభత్సం

Telangana Updates: * రామచంద్రపురంలో ఎనిమిది ఇళ్లలో చోరీ * తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలు * లక్షల్లో నగదు, బంగారు ఆభరణాలు అపహరణ

Update: 2021-01-05 07:07 GMT

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌‌గా దొంగలు రెచ్చిపోయారు. ఎనిమిది ఇళ్లలో దుండగులు చోరికి పాల్పడ్డారు. లక్షల్లో నగదు, తులాల కొద్ది ఆభరణలు ఎత్తుకెళ్లారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ ముందున్న దుర్గమ్మ ఆలయంలో హుండీని దొంగలించారు వారిని ఇప్పటి వరకు పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News