తెలంగాణ: పంచాయతీ రాజ్ ఉద్యోగులకు భారీ ఊరట – పెండింగ్ జీతాల విడుదల, సేవల పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.

Update: 2025-07-24 16:40 GMT

తెలంగాణ: పంచాయతీ రాజ్ ఉద్యోగులకు భారీ ఊరట – పెండింగ్ జీతాల విడుదల, సేవల పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో జారీ చేసింది.

పెండింగ్ జీతాల విడుదల

సేవల పొడిగింపు లేట్ కావడంతో గత మూడు నెలలుగా ఈ ఉద్యోగుల జీతాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. ఇప్పుడు జీవో జారీ కావడంతో పెండింగ్‌లో ఉన్న జీతాల ప్రాసెసింగ్ పూర్తి కాగా, ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో నేడో, రేపో ఉద్యోగుల ఖాతాల్లో మూడు నెలల జీతాలు జమ కానున్నాయి.

ఉద్యోగుల సంతోషం

ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించనుంది. పంచాయతీ రాజ్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సేవలను గుర్తించినందుకు ప్రభుత్వం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News