Telangana News: రేషన్ కార్డుదారులకు పండగ లాంటి వార్త.. సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
Telangana Ration Card: తెలంగాణ రేషన్ కార్డుదారులకు భారీ ఊరట! వచ్చే ఏడాది నుంచి సన్న బియ్యంతో పాటు 5 రకాల నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Telangana News: రేషన్ కార్డుదారులకు పండగ లాంటి వార్త.. సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా, నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి సన్న బియ్యంతో పాటు మరో ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సన్న బియ్యం పంపిణీపై రాజీ పడము
గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ విషయంలో నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, లబ్ధిదారులకు మెరుగైన ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ధాన్యం సేకరణలో రికార్డు.. రైతుల ఖాతాల్లోకి రూ.18 వేలు కోట్లు
కొనుగోలు వివరాలు: 2025-26 వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 71.70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.
చెల్లింపులు: ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18,000 కోట్లను జమ చేసినట్లు మంత్రి వివరించారు.
సన్న రకాలు: సేకరించిన ధాన్యంలో 38.37 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉండటం విశేషం.
బోనస్: సన్న బియ్యం పండించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల వల్లే ఇంత భారీ స్థాయిలో ధాన్యం సేకరణ సాధ్యమైందని ఆయన కొనియాడారు. సాంబ మసూరి, తెలంగాణ మసూరి వంటి మేలు రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.