Telangana police academy: పోలీస్ అకాడమీలో కరోనా కలకలం.. 180 మందికి పాజిటివ్
Telangana police academy:తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆదివారం నిర్ధారణ అయింది.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆదివారం నిర్ధారణ అయింది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో సుమారు 180 మందికి వైరస్ పాజిటివ్గా గుర్తించినట్లు అకాడమీ డైరెక్టర్ వీకేసింగ్ తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారితో కలిపి ఇక్కడ 2200 మందికిపైగా ఉన్నారు.
1100 మందికిపైగా ఎస్ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ అకాడమిలో బాధితుల కోసం అకాడమీలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక ఐపీఎస్ అధికారి, ముగ్గురు అదనపు డీఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలతో పాటు శిక్షణ ఎస్ఐలు, సిబ్బందికి వైరస్ సోకింది. వైరస్ బారినపడ్డ వారిలో ఎవరికీ లక్షణాలు బయటపడలేదని పేర్కొన్నారు. అందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. తొలుత ఇక్కడ వంట మనిషికి వైరస్ సోకినట్లు సమాచారం.