వాహనంలో ముందు సీటు కోసం కొట్టుకున్న కానిస్టేబుళ్లు..

వాహనంలో ముందు సీటు కోసం కొట్టుకున్న కానిస్టేబుళ్లు..
x
Highlights

ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. అది అలా ఇలా కాదు .. రోడ్డుపై ఆపై అదే రోడ్డు పక్కన ఉన్న తుపల్లో పడి మరీ కొట్టుకున్నారు. పోనీ ఇంతలా కొట్టుకున్నారు రీజన్ పెద్దది అయి ఉంటుంది అనుకుందామా అంటే అది చాలా ఫన్నీ రీజన్.

ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. అది అలా ఇలా కాదు .. రోడ్డుపై ఆపై అదే రోడ్డు పక్కన ఉన్న తుపల్లో పడి మరీ కొట్టుకున్నారు. పోనీ ఇంతలా కొట్టుకున్నారు రీజన్ పెద్దది అయి ఉంటుంది అనుకుందామా అంటే అది చాలా ఫన్నీ రీజన్. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బీదూర్ ప్రాంతానికి చెందిన రాజేష్ సింగ్ మరియు సునీల్ కుమార్ లకి పోలీస్ రెస్పాన్స్ వెహికిల్ లో భాద్యతలు అప్పజెప్పారు.. అయితే ఆ వెహికిల్ లో ఎవరు ముందు కూర్చోవాలి అన్నదగ్గర ఇద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది.. ఇద్దరు పోలీసులు అన్నమాట మర్చిపోయి చిన్నపిల్లడిల్లా రోడ్డుపై కొట్టుకున్నారు.. వీరిని ఆపడానికి ట్రై చేసిన డ్రైవర్ మాట కూడా వీళ్ళు వినలేదు..అదే దారిని పోయేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీనితో ఈ వీడియో ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories