తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అయితే ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లీ ఫలితాలు మాత్రమే విడుదల కానున్నాయి. నాంపల్లి ఇంటర్బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 1.60 లక్షల మంది పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేవలం రెండో సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.