మున్సిపల్ ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
మున్సిపల్ ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
మున్సిపల్ ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కౌంటర్ లో ప్రభుత్వం తెలిపింది. కోర్ట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ సమస్యలు కూడా పరిష్కరించామని చెప్పింది. అలాగే కోర్ట్ ఆదేశాలు ఇస్తే అన్ని మున్సిపాలిటీ లకు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వివరించింది. ఈ నేపథ్యంలో నేడు పిటిషన్ పై మరోసారి హైకోర్టు విచారించనుంది.