ఎర్రమంజిల్ వివాదంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ రాష్ట్రాలు కొత్త నగరాలను, కొత్త అసెంబ్లీలను నిర్మించుకుంటున్నాయన్న హైకోర్టు అలాంటిది కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీని నిర్మిస్తే తప్పేంటని పిటిషనర్ను సూటిగా ప్రశ్నించింది. అయితే అసెంబ్లీని నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదన్న పిటిషనర్ పురాతన కట్టడాలను కూల్చొద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. ఖాళీ స్థలంలో అసెంబ్లీని నిర్మిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వారసత్వ కట్టడాల జాబితాను మార్చే అధికారం HMDAకి ఉందా? అని ప్రభుత్వం తరఫు లాయర్ను హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.