తెలంగాణ సర్కారుకు హైకోర్టు నోటీసులు

Update: 2019-08-30 10:30 GMT

వాహనాల స్పీడ్ కంట్రోల్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై తీసుకున్న చర్యల గురించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. తెలంగాణలో ట్రాన్స్ పోర్ట్ వాహనాలు అతివేగంతో వెళ్లుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు మృతి చెందుతున్నారని ది రైట్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు అమర్చేలా రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించాలని కోరుతూ ది రైట్ సొసైటీ సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.  

Tags:    

Similar News