ప్రధానమంత్రి సహాయనిధికి తెలంగాణ గవర్నర్ విరాళం
కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై తన వంతుగా పీఎం కేర్స్ సహాయ నిధికి రూ.5లక్షలు విరాళం అందించారు.
దీనికి సంబంధించిన చేక్కును ఆమె రాజ్భవన్ నుంచి కేంద్రానికి పంపించారు. అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. రూ.3.50 లక్షల చెక్కును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.