బీసీ విద్యార్థులకు తీపి కబురు
బీసీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం దీపావళి సందర్భంగా కానుకను ఇచ్చింది.
బీసీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం దీపావళి సందర్భంగా కానుకను ఇచ్చింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించడానికి నిధులు విడుదల చేసింది. పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలకు సంబంధించి నిధులను విడుదల చేసింది.
ప్రస్తుతం నిర్దేశించిన బడ్జెట్కు అనుగుణంగా రూ.1,196.58 కోట్ల బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లను విడుదల చేసినట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థ సారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో 2017–18, 2018–19 సంవత్సరాలలో ఉన్న బకాయిలను దాదాపు కట్టేయనుంది. తాజాగా ఆమోదించిన బడ్జెట్ లో బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు, బీసీల కులాంతర వివాహ ఆర్థిక సాయం లాంటి అంశాలను చేర్చాయి.