రైతులకు శుభవార్తను అందజేసిన తెలంగాణ ప్రభుత్వం

రైతులకు శుభవార్తను అందజేసింది తెలంగాణ ప్రభుత్వం.. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Update: 2020-03-17 15:13 GMT
Telangana Government

రైతులకు శుభవార్తను అందజేసింది తెలంగాణ ప్రభుత్వం.. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాల్లో బకాయిలు ఉన్న వారికి మాఫీ చేయాలని నిర్ణయిం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఒకే దఫాలో.. రూ.లక్ష వరకు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని పేర్కొందిచెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News