గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ నేతలు..పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

Update: 2019-09-17 14:23 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయింపులపై కొత్త గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదుచేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన టీకాంగ్రెస్‌ లీడర్లు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని మెమొరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎమ్మెల్యేల విలీనం చెల్లదని చెప్పామని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలను అందజేశామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కోర్టులోఉందని, సబితా ఇంద్రారెడ్డిని టీ-కేబినెట్ లోకి తీసుకుని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News