విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం శుభవార్త...
విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాప్తచెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం గత నెల 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో వారంతో తిరగి భారత దేశానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా వారందరినీ స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మే 3 అనంతరం లాక్డౌన్కు కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తున్న సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యలు తమ వారిని వారిని స్వదేశానికి తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఈ నేపథ్యంలోనే ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గాను కసరత్తులను మొదలుపెట్టింది. విదేశాల్లో చిక్కుకుని ఉన్నవారి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఎంత మంది విదేశాల్లో చిక్కుకున్నారు, ఎంత మందిని తిరిగి దేశానికి రానున్నారు అన్నవివరాలను సేకరించాలని భారత రా యబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంధి వివరాలను సేకరిస్తున్న పనిలపడ్డారు. ఇప్పటికే ఒమన్లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఖతర్లోని రాయబార కార్యాలయం కూడా ఆన్లైన్లో వివరాలను సేకరించి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. దీంతో వారి వారి కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ వారికోసం ఎదురు చూపులు చూస్తున్నారు.