పాఠం చెబుతూనే.. గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు..

Update: 2019-10-28 09:54 GMT

విద్యార్ధులకి పాఠాలు చెబుతూనే చనిపోయాడు ఓ ఉపాధ్యాయుడు.. ఈ విషాదకరమైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెబుతుండగా గుండె పోటు రావడంతో కుర్చులో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. దీనితో విద్యార్ధులు షాక్ కు గురై ఆ పాఠశాలలోని టీచర్లకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారు వచ్చి చూసేసరికి అప్పటికే అతను చనిపోయాడు. విజయ్ సింగ్ అనే ఈ ఉపాధ్యాయుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలకట్టే ఎస్సీ కాలనీలోని పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ సింగ్ చనిపోయిన విషయాన్నీ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఇక లేరు అని విద్యార్దులు కన్నీటి పర్యాంతం అయ్యారు. 

Tags:    

Similar News