ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వర్షాలు బాగా కురుస్తాయని స్వర్ణలత భవ్యవాణి వినిపించారు. నా ప్రజలందరూ సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. భక్తుల ముడుపులు సంతోషంగా అందుకున్నాను. వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. నాకు బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నా. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదు వారాలపాటు పప్పు, బెల్లంతో శాకలు సమర్పించండి. నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. అని స్వర్ణలత చెప్పారు.