Telangana: తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు

Telangana: ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2021-06-15 15:45 GMT

విద్యార్థులు (ఫైల్ ఫొటో)

Telangana: ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ నెల 19 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలవుతోన్న సంగతి తెలిసిందే. కరోనాతో ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ రెండో ఏడాది పరీక్షలను కూడా రద్దు చేసింది. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసిన సంగతి తెలిపిందే.

Tags:    

Similar News