చెక్ బౌన్స్ కేసులో సుఖేష్ గుప్తా అరెస్ట్..

Update: 2019-10-29 15:26 GMT

ఎంబీఎస్ జ్యూయలరీ ఎండీ సుఖేష్‌ గుప్తాను హైదరాబాద్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. కోల్‌కతా కోర్టు నుంచి వచ్చిన అరెస్ట్‌ వారెంట్‌తో.. సుఖేష్‌ గుప్తాను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్ కత్తాకు చెందిన బ్యాంకు నుంచి కోట్ల రూపాయల లోన్‌ తీసుకున్న సుఖేష్ గుప్తా.. చెక్ బౌన్స్ కింద కేసు నమోదైంది. దీనిపై విచారించిన కోర్టు.. సుఖేష్‌ గుప్తాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో సుఖేష్‌గుప్తాను అదుపులోకి తీసుకున్న సుల్తాన్‌ బజార్ పోలీసులు.. కోల్ కత్తా తరలించనున్నారు.

Tags:    

Similar News