టిక్‌టాక్ చేస్తూ అడవిలో తప్పిపోయిన విద్యార్థి

Update: 2019-07-29 09:32 GMT

టిక్ టాక్ మోజు ఓ విద్యార్ధిని అడవిపాలు చేసింది. మురళి అనే విద్యార్ధి శేషాచలం అడవుల్లో టిక్ టాక్ చేస్తూ దారి తప్పాడు. వాట్సప్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో అర్ధరాత్రి అడవిబాట పట్టిన పోలీసులు విద్యార్దిని కాపాడారు. భయాందోళనకు గురైన విద్యార్ధి ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. ఒక వైపు అడవి.. మరోవైపు అర్ధరాత్రి కావడంతో ఎటు నుంచి ఏ క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందో అన్న ఆందోళనతో భయపడిన మురళిని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కలకడ మండలానికి చెందిన మురళి.. విద్యానికేతన్ కాలేజీ మైక్రోబయాలజీలో మూడో సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు.  

Tags:    

Similar News