శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ కుటుంబం ఆచూకీ గల్లంతైంది. నెలరోజులుగా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, హయత్నగర్లోని శాంతినగర్కు చెందిన శ్రీధర్రెడ్డి, ప్రశాంతి భార్యభర్తలు. వీరికి 15 నెలల బాబు విహాన్రెడ్డి ఉన్నాడు. పుట్టిన రోజు సందర్భంగా గత నెల 11న శ్రీధర్రెడ్డి దంపతులు కుమారుడిని తీసుకుని శ్రీశైలం వెళ్లారు.
శ్రీశైలం వెళ్లిన వారు మూడు రోజుల వరకు హైదరాబాద్లోని కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నారు. చివరిసారి ఈ నెల 5న తల్లి జయమ్మకు ఫోన్ చేసిన శ్రీధర్రెడ్డి... తాము శ్రీశైలంలోనే ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో తల్ల జయమ్మ ఆందోళన చెందింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.