శబరిమలకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Update: 2019-11-07 04:00 GMT

ప్రతి ఏటా శబరిమలకు భక్తులు లక్షల్లో వెలుతుంటారు. ప్రయివేటు వాహనాల ద్వారా, బస్సుల ద్వారా చాలా మంది భక్తులు వెలతారు. ఈ సారి భక్తులకు ఎలాంటి ఇబ్బంధి కలగకుండా దక్షిణ మధ్య రైల్వే శాఖవారు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

20 ప్రత్యేక రైళ్లను హైదరాబాద్‌, కాచిగూడ, మచిలీటప్నం, కాకినాడ, స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లాంకు నడపనున్నారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల అంటే నవంబర్ 18వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ మధ్య ఈ రైళ్లు నడపనున్నారని స్పష్టం జేసారు. ఇంకెందుకు ఆలస్యం శబరిమల వెల్లవలసిన భక్తులు ఇప్పుడే వారి టికెట్ ను రిజర్వ్ చేసుకోండి.



Tags:    

Similar News