సథరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 3రోజుల హాలిడే బజార్

సథరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 15 శాతం రాయితీలతో మూడు రోజుల హాలిడే బజార్ నిర్వహిస్తున్నారు.

Update: 2020-01-24 06:49 GMT

సథరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 15 శాతం రాయితీలతో మూడు రోజుల హాలిడే బజార్ నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ ప్రయాణికులకు సథరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలోప్రతేక రాయితీలతో ఈ నెల 24,25,26 తేదీల్లో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లోని బ్రాంచిల్లో మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ట్రావెల్, టూరిజం రంగంలో సథరన్ ట్రావెల్స్ ఒకటిగా భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించినట్లు ఆయన తెలిపారు. 49 సంవత్సరాలుగా ప్రధాన మెట్రోపాలిటన్ సిటిలలతో పాటు ముఖ్యమైన నగరాల్లో సథరన్ ట్రావెల్స్ శాఖల నెట్ వర్క్ ఉందని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, కోయంబత్తూర్, మరియు జైపూర్ న్యూడిల్లీలోని సెంట్రల్ లాంటి ప్రధాన నగరాలలో హాలిడే బజార్‌ను నిర్వహిస్తున్నామన్నారు.


Tags:    

Similar News