విషాదం : కన్న కొడుకే కాలయముడయ్యాడు

Update: 2020-05-27 04:18 GMT

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మంచంపట్టిన కన్నతల్లిని సాకలేక ఓ తనయుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తల్లి పట్ల కన్నకొడుకే యముడయ్యాడు. నల్లగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ(55) కొడుకు తిరుమల లింగస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లాడు. తల్లి వ‌ృద్ధురాలు కావడంతో ఆమెను స్వగ్రామంలోనే ఉంచి వెళ్లాడు.

అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో లింగస్వామి పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్న లింగస్వామికి.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాంతో తల్లిని పోషించలేక గడిచిన రాత్రి నిద్రిస్తున్న తన తల్లిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. మంటల్లో శాంతమ్మ సజీవదహనం అయింది. తల్లిని సాకలేకనే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లుగా స్థానికుల సమాచారం. 

Tags:    

Similar News