Hanamkonda: అత్తను గన్‌తో కాల్చి చంపిన అల్లుడు

Hanamkonda: కోటపల్లి మంచిర్యాల్‌ పీఎస్‌లో రైటర్‌గా పనిచేస్తున్న నిందితుడు

Update: 2023-10-12 07:45 GMT

Hanamkonda: అత్తను గన్‌తో కాల్చి చంపిన అల్లుడు

Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లసింగారంలో అత్తను హత్య చేశాడు అల్లుడు. డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం మరింత ముదరడంతో విచక్షణ కోల్పోయిన అల్లుడు ప్రసాద్.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో అత్తను కాల్చి చంపాడు. కోటపల్లి మంచిర్యాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రసాద్‌ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్‌.. రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు గుర్తించారు.

Tags:    

Similar News