హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..

Update: 2020-03-02 04:51 GMT
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం నెలకొంది. హస్తినాపురంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులను ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి, వారి కుమారులు కల్యాణ్, జయకృష్ణలుగా పోలీసులు గుర్తించారు. ప్రదీప్ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News