కూకట్ పల్లి బాలాజీనగర్ బిగ్సీ షోరూంలో వన్ ప్లస్ బ్రాండ్ మొబైల్ ను ప్రముఖ సినీతార సమంత ఆవిష్కరించారు. మొబైల్ సంస్థలన్నీ బిగ్సీ ద్వారానే మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయన్నారు బిగ్ సి సంస్థ ఫౌండర్ సీఎండీ ఎం.బాలు చౌదరి. బిగ్సీ లో విడుదల చేసిన మొబైల్స్ కు ప్రజల నుంచి విశేష ప్రజాధరణ లభిస్తుందన్నారు. ఇప్పుడు వన్ ప్లస్ మొబైల్ కూడా అదే బాటలో కొనసాగుతుందన్నారు బాలు చౌదరి. బిగ్సీ ద్వారా వన్ ప్లస్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్.