ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
♦ హైదరాబాద్ కూకట్పల్లిలో ఢీ కొన్న రెండు బస్సులు ♦ ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం
హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర రెండు బస్సులు ఢీ కొన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
దీంతో రోడ్డుపై బస్సులను ఆపేసిన డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. రోడ్ పైనే బస్సులు ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వారించి ప్రయాణీకులను ఇతర బస్సుల్లో పంపించారు.