హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున.. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మొజాంజాహి మార్కెట్ సిగ్నల్ మలుపు దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా.. ఏడుగురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ అధికారులు.. క్రేన్ సాయంతో బస్ను పక్కకు జరిపి.. రోడ్ను క్లియర్ చేశారు.