తాజాగా హైదరాబాద్ మంగళ్హాట్ పీఎస్ విడుదల చేసిన రౌడీషీట్లో తన పేరు ఉండటంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలోని పలువురిపై క్రిమినల్ ఆరోపణలు ఉన్నప్పటికీ వారిని రౌడీషీట్లో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. రౌడీషీట్లో తన పేరును పేర్కొనడంపై ప్రభుత్వంతో పాటు పోలీసు శాఖపై మండిపడ్డారు.
''నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నాపై రౌడీ షీట్ తీయలేదు. తెలంగాణ పోలీసుల దృష్టిలో నేను ఎమ్మెల్యేను కాదు. రౌడీ షీటర్నే. ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గతంలో రౌడీ షీట్లు ఉండేవి. వారి పేర్లు రౌడీ షీట్లో పెట్టే దమ్ము పోలీసులకు ఉందా? దీనిపై కేసీఆర్, హోంమంత్రి సమాధానం చెప్పాలి.'' అని రాజాసింగ్ అన్నారు.