కిలో ప్లాస్టిక్ కు రెండు కిలోల బియ్యం స్కీమ్

Update: 2019-10-12 13:38 GMT

ప్లాస్టిక్ నిషేధానికి వరంగల్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నెలరోజుల ప్రణాళిక ముగియడంతో కిలో ప్లాస్టిక్ సేకరించి ఇచ్చిన వారికి రెండు కిలోల బియ్యం ఇస్తామని తీర్మానించిన గ్రామ పంచాయితీ ఆ మేరకు గుర్రాల రాజశేఖర్ అనే వ్యక్తికి పదికిలోల బియ్యం అందించింది. రాజశేఖర్ ఆ బియ్యాన్ని నిరుపేద అయిన సింగాపురం ఐలయ్య కుటుంబానికి డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అడిషనల్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ అతిధిగా విచ్చేశారు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని గ్రామ పంచాయతీ సభ్యులు నిర్ణయించారు.

Full View 

Tags:    

Similar News