తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. కుటుంబ సమేతంగా రేవంత్ సోనియాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్రెడ్డి సోనియాను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. సోనియాను కలిసిన వారిలో ఆయన భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. సోనియాను రేవంత్ కుటుంబ సభ్యులు కలిసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.