ఉద్యోగ అవకాశాలు స్థానికులకే దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా పొందిందని తెలిపారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.