2,788 మంది ఎస్జీటీల నియామకం
ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017)లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ మంగళవారం రాత్రి తో ముగిసాయి.
ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017)లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ మంగళవారం రాత్రి తో ముగిసాయి. ముగిసాయి. మైదాన ప్రాంతాల్లో మొత్తం 3,127 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 2,822 పోస్టులకు మాత్రమే టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఇటీవల ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా టీఎస్పీఎస్సీ విద్యాశాఖకు అందజేసింది. దీంతో జిల్లా అధికారులు 2,788 అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. పోస్టింగ్ ఆర్డర్లను పొందినవారు బుధవారం సంబంధిత పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్కు హాజరుకాని 34 మందికి అభ్యర్ధులకు వారి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్పోస్ట్ ద్వారా వారికి డీఈవోలు పంపించనున్నారని తెలిపారు.