మంచిర్యాల జిల్లా తాండూరులో పెను ప్రమాదం తప్పింది. రైల్ పట్టా విరగడంతో సికింద్రాబాద్- కాగజ్నగర్ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు మరమ్మత్తులు చేశారు. అయితే అధికారులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
సికింద్రాబాద్ - కాగజ్ నగర్ రైల్వే మార్గంలో మంచిర్యాల జిల్లా తాండూరులో రైలు పట్టా విరిగింది. అయితే ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి.