మహబూబాబాద్ జిల్లా ఏరియా హస్పిటల్ ఎదుట ధర్నా

* వేతనాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ సెక్యూరిటీ.. స్వీపర్లు... శానిటరీ సిబ్బంది ఆందోళన బాట

Update: 2022-11-05 08:13 GMT

మహబూబాబాద్ జిల్లా ఏరియా హస్పిటల్ ఎదుట ధర్నా

Mahbubabad: నాలుగు నెలల నుంచి వేతనాలు రావటం లేదని వెంటనే పెండింగ్ బిల్లును మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఏరియా హస్పిటల్ ఎదుట సెక్యూరిటీ స్వీపర్లు శానిటరీ సిబ్బంది కలిసి అందోళన చేపట్టారు ఆస్పత్రిలో విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సాయి ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలపై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరారు. వేతనాల మంజూరు విషయంలో సాయి ఏజెన్సీ అధికారులు కలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వేతనాలు రాకపోవటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు..

Tags:    

Similar News