యాదాద్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత

Update: 2019-09-07 14:44 GMT

యాదాద్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయగిరి నుంచి యాదాద్రి వరకు బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలు గుట్ట ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.   

Tags:    

Similar News