హైదరాబాద్లో గతంలో వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసు మూలాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాతబస్తీకి చెందిన ముఠాకు పోల్కంపేట యువకుల సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వహీద్ పాషా, అహ్మద్ పాషా అనే యువకులు భారీగా సిమ్ముకార్డులు సమకూర్చారు. తీగలాగితే సిమ్ కార్డుల డొంకా కదులుతోంది. అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఇద్దరు జిల్లా వాసులు కావడంతో కలకలం రేగుతోంది.