రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ప్రభుత్వ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నాలుగేళ్ల పాపతో పంపిణీ కార్యక్రమానికి వచ్చారు టీఆర్ఎస్ నాయకుడు. అయితే పాప కారులో ఉన్న విషయాన్ని మర్చిపోయి డోర్ లాక్ చేసుకొని వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి పాపను రక్షించారు.